జూబ్లీహిల్స్: ఐదేండ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. వైద్యారోగ్య శాఖ కృషి.. తల్లిదండ్రుల్లో పెరిగిన అవగాహన ఫలితంగా రాష్ట్రంలో 14 ఏండ్లుగా పోలియో కేసులు నమోదు కాలేదన్నారు. ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని బోరబండ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ అనిల్ కుమార్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్లతో కలిసి ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్తో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.