మేడ్చల్, అక్టోబర్ 2 : జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను సీఎం కేసీఆర్ నేరవేర్చుతున్నారని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ఎత్తైన మహాత్మాగాంధీ విగ్రహాన్ని మంత్రి మల్లారెడ్డి సోమవారం ఆవిష్కరించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే దేశంలో అభివృద్ధి చెందుతుందని గాంధీ చెప్పినట్టు కేసీఆర్ పల్లెల అభివృద్ధికి పాటుపడుతున్నారని తెలిపారు.
అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా నిరుపేదలు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. విద్యా, వైద్యం ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. గాంధీ జయంతి రోజున ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని తెలిపారు. పాలకవర్గాన్ని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం శిల్పి సత్యనారాయణను మంత్రి మల్లారెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ రజితారాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజావిజయానందారెడ్డి, మార్కెట్ చైర్మన్ భాస్కర్యాదవ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దయానంద్ యాదవ్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
పీర్జాదిగూడలో..
పీర్జాదిగూడ : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో సోమవారం జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ జక్క వెంకట్రెడ్డి, అధికారులు, కార్పొరేటర్లతో కలిసి గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కమిషనర్ ఇస్తావత్ నమ్య, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
గోధుమకుంటలో గాంధీజీ విగ్రహావిష్కరణ
కీసర : మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా సోమవారం మండలంలోని గోధుమకుంటలో పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గాంధీజీ విగ్రహాన్ని గ్రామ సర్పంచ్ ఆకిటి మహేందర్రెడ్డి ఆవిష్కరించారు. విగ్రహ దాత, స్థానిక పంచాయతీ సభ్యుడు సామల ప్రేమ్నాథ్రెడ్డిని సర్పంచ్ అభినందించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సురేశ్రెడ్డి, ఎంపీటీసీ కిరణ్జ్యోతి, పంచాయతీ సభ్యులు పాల్గొన్నారు.