ఘట్కేసర్, ఆగస్టు1: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుల వృత్తులకు సీఎం కేసీఆర్తోనే ఆదరణ పెరిగిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పోచారం మున్సిపాలిటీ యంనంపేట్లోని 1, 2వ వార్డులు ఇస్మాయీల్ఖాన్గూడ, యంనంపేట్లలోని కురుమలకు 12 యూనిట్ల గొర్రె పిల్లలను ప్రభుత్వ ఆధ్వర్యంలో మంత్రి సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అంతరించి పోయిన కుల వృత్తులను ప్రోత్సహించి ఆ వృత్తులలో జీవనం సాగిస్తున్న కుటుంబాలలో సీఎం కేసీఆర్ ఆనందం నింపారని పేర్కొన్నారు. కురుమలకు గొర్రె పిల్లల పంపిణీ, జాలర్లకు, ముదిరాజ్లకు చేప పిల్లల పంపిణీ, ఇతర అన్ని కుల వృత్తుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసి సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం, పంపిణీ చేస్తున్న గొర్రె పిల్లలతో రాష్ట్రంలో గొర్రెల సంపద రెట్టింపు అయ్యిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో సమీపంలోని ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణకు గొర్రె మందలను దిగుమతి చేసుకునే వారని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని వివరించారు.
సీఎం కేసీఆర్ చేపట్టిన గొర్రె పిల్లల పథకంతో గొల్ల కురుమల ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని తెలిపారు. అనంతరం ఇస్మాయీల్ఖాన్గూడలో హెచ్ఎండీఏ నిర్మిస్తున్న తాగునీటి ట్యాంక్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. కమిషనర్ వేమన రెడ్డి, పశువర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ పి.శేఖర్, ఏడీ డాక్టర్ కేశవ సాయి, ఘట్కేసర్ పశువైద్య అధికారి డాక్టర్ పద్మిని, దమ్మాయిగూడ మేయర్ మేకల కావ్య, పోచారం చైర్మన్ కొండల్రెడ్డి, వైస్ చైర్మన్ రెడ్డ్యానాయక్, స్థానిక కౌన్సిలర్ మహేశ్, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు మందాడి సురేందర్రెడ్డి, రైతు సొసైటీ అధ్యక్షుడు రాంరెడ్డి, మండల రైతు సమితి అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి, నాయకులు స్వామి కురుమ, ఎన్.శేఖర్ ముదిరాజ్, జగన్ మోహన్రెడ్డి, కాశయ్య, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.