సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి చెందుతున్న కొత్త టెక్నాలజీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎంతో ప్రత్యేకమైంది. ప్రతి రంగంలోనూ ఏఐ వినియోగం గణనీయంగా పెరుగుతున్నది. తాజాగా ఐటీ కంపెనీలు ఏఐ టెక్నాలజీ ఉత్పాదక రంగానికి అవసరమైన విధంగా వినియోగిస్తున్నారు.
అనే అంశంపై ఐటీ రంగ నిపుణులకు, స్టార్టప్ కంపెనీల వ్యవస్థాపకులకు, ఔత్సాహిక వ్యాపార వేత్తలకు అవగాహన కల్పించేందుకు టీ హబ్లో ఈనెల 28న మైక్రోసాఫ్ట్ ఉత్పాదక ఏఐ (జనరేటివ్ ఏఐ) సదస్సును నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. భావ సారూప్యత కలిగిన వ్యాపారవేత్తల సంఘంతో కలిసి పనిచేసేందుకు, ఆవిష్కరణలు చేసేందుకు, ఒకరి ఆలోచనలు మరొకరితో పంచుకునేందుకు ఇది ఒక వేదికగా మారుతుందని చెప్పారు. ఆసక్తి ఉన్న వారు ఈ కింది లింకులో (https://bit.ly/3NIMrnF) తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.