GHMC | సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ పరిధిలో తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉండవద్దని, సూక్ష్మ స్థాయి ప్రణాళికలు రచించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి శుక్రవారం ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తాగునీటి సరఫరా, ఇతర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. రాబోయే 5 నెలలకు తాగునీరు సరఫరా చేసేందుకు క్షేత్ర స్థాయిలో మైక్రో లెవల్ ప్లాన్స్ రూపొందించుకోవాలని సూచించారు. అవసరాన్ని బట్టి అదనపు జలాలను తరలించడానికి ఎమర్జెన్సీ పంపింగ్ కోసం ఏర్పాట్లు మొదలు పెట్టినట్లు వెల్లడించారు. ఆయా ప్రాంతాలకు కేటాయించే నీటి సరఫరాపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఏ ప్రాంతంలోనైనా సరఫరాలో తకువ నీరుంటే.. సర్దుబాటు చేసే లాగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. నీటి సరఫరాలో సమయ పాలన పాటించాలని, ఏవైనా ఇబ్బందులుంటే ముందుగానే ప్రజలకు సమాచారమివ్వాలని తెలిపారు. క్షేత్ర స్థాయిలో లైన్ మెన్లు గైర్హాజరైన పక్షంలో.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. కలుషిత నీటి సరఫరా, లీకేజీలు జరిగితే సమస్యను గుర్తించి.. 24 గంటల్లో పరిషరించాలని తెలిపారు. మోటార్లు, బూస్టర్లు, వాల్వులు రిపేర్లు వస్తే.. ఏఎంస్ కింద మరమ్మతులు చేయాలని వివరించారు. పర్యవేక్షణ, పరిషారానికి ప్రత్యేక బృందాలను సీజీఎంల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలన్నారు. చేతి పంపులు, బోర్ వెల్స్ నిర్వహణపై దృష్టి సారించాలని.. అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉండేందుకు అదనపు సామగ్రి ఉంచుకోవాలని పేరొన్నారు.
డిమాండ్ను అంచనా వేసి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ప్రణాళికలు వేసుకోవాలని ఎండీ సూచించారు. నగరంలో ఇప్పటికే 72 ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్లు ఉండగా.. డిమాండ్ని బట్టి అదనపు ఫిల్లింగ్ స్టేషన్ల కోసం ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. తాగునీటి సరఫరా సమయాల్లో కొంత మంది మోటార్లతో నీటిని తోడుతున్న ప్రాంతాల్లో లో-ప్రెషర్ సమస్యలు వస్తున్నాయని.. వీటిని నివారించడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్కు ఆదేశించారు. ఈ సమావేశంలో ఈడీ డా.ఎం.సత్యనారాయణ, ఈఎన్సీ, డైరెక్టర్ ఆపరేషన్స్-1 అజ్మీరా కృష్ణ, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, డైరెక్టర్ ఆపరేషన్స్-2 స్వామి, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ గ్యానేందర్ రెడ్డి, జీఎంలు, మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.