మణికొండ మార్చి 11: అతివేగంతో వాహనాన్ని నడుపుతూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాద ఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. గండిపేటలోని ఎంజీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న ఆరుగురు విద్యార్థులు (TS08 BEG4929) స్విఫ్ట్ కారులో మంగళవారం సాయం త్రం కళాశాల నుంచి ఇంటికి బయలు దేరారు. నియో పోలీస్ సమీపంలోకి రాగానే వేగంగా వెళ్లి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న శ్రీకర్ (18) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.
మిగిలిన ఐదుగురిలో హేమ సాయి(19), వివేక్(19), సృజన(18), కార్తికేయ(18), హర్ష(19)కి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో హర్షసాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను స్థానిక వైద్యశాలలో చేర్పించిన పోలీసులు శ్రీకర్ మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.