సిటీబ్యూరో, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : ప్రతి యేటా జనవరి1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నాంపల్లి మైదానంలో జరిగే నుమాయిష్కు నిత్యం వేలాది మంది సందర్శకులు విచ్చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయగా, తాజాగా హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ రాత్రి 1 గంట వరకు గాంధీ భవన్ మెట్రోస్టేషన్ నుంచి ప్రత్యేకంగా రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. అలాగే ఈ మెట్రోస్టేషన్లో టికెట్ కౌంటర్ల సంఖ్యను 6 వరకు పెంచుతున్నామని అధికారులు తెలిపారు. కారిడార్ -1లో మియాపూర్, ఎల్బీనగర్, కారిడార్-3లో నాగోల్-రాయదుర్గం మార్గాల్లో నడిచే రైళ్ల వేళలను పొడిగించామని తెలిపారు.