హైదరాబాద్ : మెట్రోసేవల్లో అంతరాయం ఏర్పడింది. నాంపల్లి మెట్రోస్టేషన్లో ట్రాక్పై రైలు నిలిచిపిపోయింది. సాంకేతిక కారణాలతో ట్రాక్పై ఆగిపోయింది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ కారిడార్లో నాంపల్లి స్టేషన్లో రైలు ఆగిపోవడంతో అన్ని సర్వీసులపై ప్రభావం చూపుతున్నది. ప్రస్తుతం సాయంత్రం కావడంతో రద్దీ అన్నిస్టేషన్ల వద్ద రద్దీ నెలకొన్నది. అయితే, రైలు నిలిచిపోవడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు.
వెంటనే మరమ్మతులు చేపట్టి, సేవలను పునరుద్ధరించనున్నట్లు ఎల్అండ్టీ అధికారులు తెలిపారు. రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదిలాఉండగా.. ఈ నెల 24న రెడ్లైన్ రూట్లో మెట్రోసేవలకు విఘాతం కలిగింది. సాంకేతిక లోపంతో రైలు మూసరాంబాగ్ స్టేషన్లో నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఎల్బీనగర్ మియాపూర్ మధ్య రాకపోకలు కొద్దిసేపు స్తంభించిపోయాయి.