KBR Park | సిటీబ్యూరో, జనవరి 31 (నమస్తే తెలంగాణ): కేబీఆర్ పార్కులో వాకింగ్ వెళ్లే వారికి ఎల్ అండ్ టీ మెట్రో ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 8 నుంచి 11.59 గంటల మధ్య మెట్రోలో ప్రయాణం చేసే వారికి నెబులా స్మార్ట్ కార్డుపై 10 శాతం రాయితీని ఇస్తున్నట్లు ప్రకటించింది.
నగరంలో ఎక్కడి నుంచైనా మెట్రోలో బయలుదేరి జూబ్లీహిల్స్ చెక్పోస్టు వద్ద దిగే వారికి సూపర్ పీక్ అవర్స్లో ఈ రాయితీని ఇస్తున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఉదయం, రాత్రి వేళ్లలో కేబీఆర్లో పార్కులో వాకింగ్ చేసే వారికి ప్రత్యేకంగా ఈ ఆఫర్ను వర్తింపజేస్తున్నామన్నారు.