నిజాం కళాశాలలో ప్లేస్మెంట్ డ్రైవ్
3500 ఉద్యోగాల భర్తీ
హాజరుకానున్న 35 కంపెనీలు
టెన్త్, ఆపై అర్హత ఉన్న వారికి ఉద్యోగావకాశం
సుల్తాన్ బజార్, మే 29: నిజాం కళాశాలలో యూజీ, పీజీ విద్యార్థులకు ఉపాధిని కల్పించేందుకు గాను సోమవారం మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి.భీమ ఆదివారం పేర్కొన్నారు. నిజాం కళాశాల, లియోనీ కన్సల్టింగ్ సర్వీసుల సంయుక్త ఆధ్వర్యంలో మెగా ప్లేస్ మెంట్ డ్రైవ్ను నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ డ్రైవ్లో పదుల సంఖ్యలో పలు రకాల సంస్థలు పాల్గొంటాయని అన్నారు. 3,500 పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న ఈ డ్రైవ్లో పదో తరగతి, ఇంటర్మీడియట్, యూజీ, గ్రాడ్యుయేట్, పీజీస్, బీఈ, బీటెక్ విద్యార్హత కలిగిన వారు అర్హులన్నారు. ఈ డ్రైవ్లో నూతనంగా ఉద్యోగం పొందే వారు నైఫుణ్యం కలిగిన వారు కూడా హాజరు కావొచ్చన్నారు.
35 కంపెనీలు.. 3,500 ఉద్యోగాలు…
నిజాం కళాశాలలో నిర్వహించే ప్లేస్మెంట్ డ్రైవ్లో 35 కంపెనీలు, 3500 ఉద్యోగాల భర్తీకి మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ను నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ డ్రైవ్ కొనసాగుతుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు https://forms,gle/kz dqMzPCfpUDPKun7 లో తమ పూర్తి వివరాలను నమోదు చేయాలని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఈ మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలను కల్పించాలనే ధ్యేయంతో ప్లేస్మెంట్ డ్రైవ్ను నిర్వహిస్తున్నాం. ఈ డ్రైవ్లో పదో తరగతి, ఇంటర్మీడియట్, బీఈ, బీ టెక్, పీజీలకు అవకాశం కల్పిస్తున్నాం. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు సోమవారం ఉదయం నిజాం కళాశాలలో నిర్వహించే డ్రైవ్కు హాజరు కావాలి. – ప్రొఫెసర్ బి.భీమ, ప్రిన్సిపాల్, నిజాం కళాశాల