మాదాపూర్, సెప్టెంబర్ 1: విద్యా నైపుణ్యం, విద్యార్థుల అభివృద్ధికి కేఎల్ యూనివర్సిటీ నిబద్ధతతో ముందుకు సాగుతున్నదని కేఎల్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ వైస్ చాన్సలర్, డాక్టర్ జి.పార్థసారధి వర్మ తెలిపారు. కొండాపూర్లోని కేఎల్ గ్లోబల్ బిజినెస్ స్కూల్లో శుక్రవారం నిర్వహించిన ఓరియెంటేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్, హెడ్ ఆఫ్ ఇండియన్ ఆపరేషన్స్ ఎట్ సేల్స్ ఫోర్స్ హెడ్ రాజు ఆర్ఎల్ కలిదిండి హాజరయ్యారు. కేఎల్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ వైస్ చాన్సలర్, డాక్టర్ జి.పార్థసారధి వర్మ, కేఎల్హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఇన్చార్జి, డాక్టర్ అనుపమ, కేఎల్హెచ్ హైదరాబాద్ క్యాంపస్ ప్రిన్సిపాల్, డాక్టర్ రామకృష్ణతో పాటు కేఎల్ యూనివర్సిటీ అధ్యాపక బృందంతో కలిసి ఆయన జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్పులకు అనుగుణంగా ఉండడానికి అభ్యాసం, నవీకరణల అవసరాన్ని గూర్చి తెలియజెప్పారు. ప్రపంచీకరణ ఆర్థిక వ్యవస్థలో అనుకూలత, ఆవిష్కరణలపై కీలక పాత్రపై వివరించారు.