పీర్జాదిగూడ, మార్చి 1: కాలం చెల్లిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్న ముఠాను బుధవారం మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసిన రిమాండ్ తరలించారు. పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి జోన్ డీసీపీ ధరావత్ జానకి, ఎస్వోటీ మల్కాజిగిరి జోన్ డీసీపీ గిరిధర్, ఏసీపీ నరేశ్రెడ్డి, సీఐ.గోవర్దనగిరితో కలిసి వివరాలను వెల్లడించారు.
నగరంలోని అబిడ్స్, ట్రూప్ బజార్కు చెందిన అంబాలజైన్, కమల్జైన్, సంగీతజైన్ ఆరు నెలల క్రితం బోడుప్పల్ రెడ్డీస్ కాలనీలో హరియంట్ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల నుంచి కాలం చెల్లిన ఆహార పదార్థాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి కాలం చెల్లిన తయారీ తేదీని మార్చి మళ్లీ వాటిపై కొత్త తేదీలను అతికించి వినియోగదారులకు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న మల్కాజిగిరి జోన్ ఎస్వోటీ పోలీసులు మంగళవారం ఆ స్థావరంపై దాడి చేసి పనిచేస్తున్న నరేశ్, అబ్దుల్ రహీమ్,ఉమాకాంత్ను అదుపులోకి తీసుకొన్నారు. బుధవారం రూ. 10 లక్షల విలువైన కాలం చెల్లిన వస్తువులను స్వాధీనం చేసుకొని ముగ్గురిని రిమాండ్కు తరలించారు. నిర్వాహకులు పరారీలోఉన్నారు.