అల్వాల్, మార్చి 21: పెంపుడు పిల్లి విషయమై ఇంట్లో వాగ్వాదం జరిగి ఓ ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. అల్వాల్ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..రిసాలాబజార్ పరిధి శివమన్ ప్రైడ్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న అముదల కుసుమలత కుమార్తె ప్రిన్సీ శ్రేష్ట (23) ఎంబీబీఎస్ చదువుతున్నది. ఇంట్లో పిల్లి విషయమై తల్లి కుమార్తెల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రేష్ట చున్నీతో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్కు సమాచారం అందించగా, శ్రేష్ట అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అల్వాల్ ఎస్ఐ తరుణ్రెడ్డి తెలిపారు.