హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ కార్యాలయంలో సంస్థ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి ప్రసగించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉద్యోగులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.