మేడ్చల్, మార్చి24(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో జీవో 58, 59, 118 జీవోలకు సంబంధించిన దరఖాస్తులను ఈ నెల 30 వరకు పూర్తిచేస్తామని జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం కంటి వెలుగు, సమగ్ర మహిళా ఆరోగ్యం, డబుల్ బెడ్రూం ఇండ్లు, 58, 59, 118 జీవోలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని మాట్లాడారు.
జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను పక్కాగా చేపడుతున్నామని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగ్యస్త, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.