సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : వీధి కుకల ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించేందుకు జీహెచ్ఎంసీ యుద్ధ ప్రాతిపదికన ప్రతి జోనుకు ఒక జాయింట్ కమిషనర్ను నియమిస్తూ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. వీధి కుకల ప్రమాదాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ క్షేత్రస్థాయిలో జాయింట్ కమిషనర్లు పర్యటిస్తారని మేయర్ తెలిపారు. ఖైరతాబాద్ జేసీగా బి. శ్రీనివాస్, కూకట్పల్లికి సంధ్య, సికింద్రాబాద్కు ఉమా ప్రకాశ్, ఎల్బీనగర్కు సువార్త, శేరిలింగంపల్లికి ఎల్.పి. మల్లయ్య, చార్మినార్కు ఎ. శైలజను నియమించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ముందస్తు రక్షణ చర్యలు తీసుకునేందుకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ద్వారా మెమో నం. 3308 జారీ చేశారు.