కొండాపూర్, జనవరి 17 :నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న సమస్యలను స్వయంగా పరిశీలిస్తూ వెంటనే శాశ్వత పరిష్కార దిశగా సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. సోమవారం ఆయన కొండాపూర్ డివిజన్ పరిధిలోని మాదాపూర్ పత్రికనగర్, కొండాపూర్ రాజరాజేశ్వరీ కాలనీలో కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీల్లో నెలకొన్న సమస్యలను స్వయంగా స్థానికులను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ దీపాలు, తాగునీటి తదితర సదుపాయాల సమస్యలకు శాశ్వత పరిష్కారాలను అందించే దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులకు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ప్రతి కాలనీ, బస్తీల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ రమేశ్, ఏఈ జగదీశ్, జలమండలి జీఎం రాజశేఖర్, డీజీఎం నారాయణ, మేనేజర్ నివర్తి, స్ట్రీట్ లైట్స్ డీఈ కిషన్, డివిజన్ అధ్యక్షులు కృష్ణగౌడ్, నాయకులు రమేశ్, తిరుపతి యాదవ్, శ్రీనివాస్, సాయి, రవి నాయక్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
భిక్షపతినగర్ కాలనీలో పర్యటన..
మాదాపూర్ డివిజన్ పరిధిలోని భిక్షపతినగర్ కాలనీలో నెలకొన్న సమస్యలు, చేపట్టాల్సిన పలు అభివృద్ధి సమస్యలపై ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ సోమవారం కార్పొరేటర్ వి. జగదీశ్వర్గౌడ్, జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగంతో పాటు జలమండలి అధికారులతో కలిసి పాదయాత్ర చేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భిక్షపతినగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏఈ ప్రశాంత్, జలమండలి జనరల్ మేనేజర్ రాజశేఖర్, డీజీఎం నారాయణ, మేనేజర్ నివర్తి, స్ట్రీట్ లైట్ డీఈ కిషన్లతో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
నానక్రాంగూడలో పర్యటన..
నానక్రాంగూడలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్రాంగూడలోని లోదబస్తీ, హరిజన బస్తీ, రజకబస్తీ, పుకట్నగర్ కాలనీ, తెలుగుబస్తీలలో ఆయన వివిధ శాఖల అధికారులు, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాతో కలిసి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా నెలకొన్న సమస్యలను బస్తీవాసులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నానక్రాంగూడ గ్రామంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కారించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. బస్తీలలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు మ్యాన్హోల్స్ను పూర్తిస్థాయిలో యంత్రం సహాయంతో చెత్త తొలగింపు పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, జీహెచ్ఎంసీ డీఈ రమేశ్, ఏఈ కృష్ణవేణి, జలమండలి జీఏం రాజశేఖర్, డీజీఏం నారాయణ, ఎలక్రికల్ డీఈ కిషన్, టీఆర్ఎస్ నాయకులు రాగం జంగయ్య యాదవ్, మల్లేశ్, రమేశ్ గౌడ్, అనిల్సింగ్ పాల్గొన్నారు.