సిటీబ్యూరో: వర్షాకాల ప్రణాళికలకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని జలమండలి ఎండీ సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో ఆయన డైరెక్టర్ స్వామి, సీజీఎం, జీఎం, ఇతర అధికారులతో శనివారం సమావేశాన్ని నిర్వహించారు.
డివిజన్ల వారీగా ఉన్న మ్యాన్హోళ్లు, డీప్ మ్యాన్హోళ్లు, నీళ్లు నిలిచే ప్రాంతాలు తదితర అంశాలను ఎండీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే మ్యాన్హోళ్ల మరమ్మతులకు చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షాకాల ప్రణాళికలకు కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు.