హైదరాబాద్ : అన్నా చెల్లెళ్ల అనుబంధానికి రాఖీ పౌర్ణమి ప్రతీకగా నిలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రికి వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో..హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తాను ప్రత్యేకంగా తయారు చేసిన ఇండిపెండెన్స్ రాఖీని కట్టారు. అనంతరం మంత్రి దంపతులకు స్వీట్స్ తినిపించారు. ఈ సందర్భంగా మేయర్ మంత్రి ఆశీస్సులు తీసుకున్నారు.