ఉప్పల్, జనవరి 4: సమన్వయంతో పనిచేస్తూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి సూచించారు. ఉప్పల్ సర్కిల్ చిలుకానగర్ డివిజన్ వార్డు కార్యాలయంలో అదనపు అంత స్తు సమావేశ మందిరం కార్యాలయాన్ని గురువారం ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమానికిమేయర్ గద్వాల విజయలక్ష్మి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, చిలుకానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనులు చేయాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, పనులు పూర్తిచేయాలన్నారు. అనంతరం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు తాను ఎల్లప్పుడు అందుబాటులో ఉం టానన్నారు. సమస్యల పరిష్కారానికి అధికారులతో కలిసి పనిచేస్తామన్నారు. పనుల్లో జాప్యం లేకుండా ప్రజలకు సేవ లు అందించాలన్నారు. కార్యక్రమంలో నేతలు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, కార్పొరేటర్లు ప్రభుదాస్, దేవేందర్రెడ్డి, సాయిజెన్ శేఖర్, జ్యోత్న్సనాగేశ్వర్రావు, అంజయ్య, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, ఈఈ నాగేందర్, ప్రవీణ్, నాగేశ్వర్రావు, డివిజన్ అధ్యక్షుడు నర్సింగ్రావు, కొండల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి జగన్, నరేశ్, వీబీ.నర్సింహ పాల్గొన్నారు.
చిలుకానగర్ డివిజన్లోని ధర్మపురికాలనీ షిర్డీ సాయిబాబా ఆలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ గీతా ప్రవీన్ చేతుల మీదుగా క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాయిబాబా ఆలయంలో హరతి పూజలో పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు మధుకర్రెడ్డి, వేణుగోపాల్, మాణిక్ ప్రభు, భాస్కర్రెడ్డి పాల్గొన్నారు.