ఖైరతాబాద్, ఆగస్టు 14: సమాజ సేవ…ఉత్తమ ఉద్యోగి…బెస్ట్ స్టార్టప్…బెస్ట్ ఇన్నోవేటర్…ఇలా సామాజిక సేవలతో పాటు వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని ఐకాన్ అవార్డులతో సత్కరించారు. శనివారం రాత్రి సోమాజిగూడలోని ది పార్క్ హోటల్లో జరిగిన ఈ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి, కాలేజీయట్ ఎడ్యూకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురికి ఐకాన్ అవార్డులను అందజేశారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ వివిధ రంగాల్లో సేవలందించిన వారిని గుర్తించి ఐకాన్ అవార్డులు అందజేయడం అభినందనీయమన్నారు. ఐకాన్ సీఈవో డాక్టర్ దినేశ్ మురుగేషన్, వ్యవస్థాపకులు క్రిష్ చింతలూరి తదితరులు పాల్గొన్నారు.