ఉస్మానియా యూనివర్సిటీ : ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని తార్నాక, ఉస్మానియా యూనివర్సిటీల్లో ఘనంగా నిర్వహించారు. తార్నాకలోని టీటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరించారు. అనంతరం టీటీయూసీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పార్టీలకు అనుబంధంగా కార్మిక సంఘాలు ఉన్నట్లుగానే టీఆర్ఎస్ అనుబంధంగా కార్మిక విభాగం ఉండాలని 2006లో టీటీయూసీని కేసీఆర్ స్థాపించి, దానికి తనను అధ్యక్షునిగా చేశారని గుర్తు చేశారు. అప్పటి నుంచి కార్మికుల సంక్షేమం కోసం టీటీయూసీ పాటుపడుతోందని చెప్పారు. యూనియన్ను సైతం రాష్ట్రంలో బలోపేతం చేశారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీటీయూసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జూపల్లి శ్రీనివాస్, నాయకులు అనితానాయక్, సురేశ్, బలరాం, వేణుగోపాల్రెడ్డి, వరికుప్పల శ్యామ్, గబ్బర్బాయ్, జిల్లా బాబు, నానునాయక్, అలీ భాయ్, కారంగుల సురేశ్, సంజీవ్, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు మాట్లాడుతూ ప్రపంచీకరణ ప్రభావంతో యాంత్రీకరణ జరిగి, కార్మికులను తొలగిస్తున్నారని ఆరోపించారు. కార్మికుల హక్కుల కోసం రూపొందించిన చట్టాలను అమలు చేసేందుకు ఐక్య పోరాటాలు నిర్మించాలని పిలుపునిచ్చారు.
యూనివర్సిటీలో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి, కార్మిక నాయకులు స్టాలిన్, కాంపల్లి శ్రీనివాస్, ఉప్పాల ఉదయ్, సాయిభగత్, లెనిన్, పద్మ, నాగమణి, లక్ష్మి, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.