హైదరాబాద్ : కిర్గిజ్స్తాన్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక WPC ఆసియా పవర్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో జూనియర్ విభాగంలో మాస్టర్ దీటి మనోజ్ కుమార్ బంగారం పతకం గెలుచుకున్నారు. ఈ పతకం సాధించడంతో.. హైదరాబాద్ బోడుప్పల్లోని ఎన్ఐఎన్ కాలనీలో నివాసముంటున్న మనోజ్ కుమార్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మనోజ్ కుమార్తో పాటు అతని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు వెలువెత్తాయి.
అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ మనోజ్ కుమార్ అసాధారణమైన ప్రతిభను, సంకల్పాన్ని ప్రదర్శించారు. ఈ గెలుపు దేశానికి గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టింది. మనోజ్ అద్భుతమైన విజయం భారతదేశానికే కాదు, తెలంగాణ రాష్ట్రానికి కూడా గర్వకారణం. పవర్లిఫ్టింగ్లో అత్యుత్తమ విజయం సాధించిన మనోజ్కు క్రీడాభిమానులు, బోడుప్పల్ వాసులు అభినందనలు తెలుపుతున్నారు.