-35తులాల బంగారంరూ. 17లక్షల నదగు పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు
బడంగ్పేట : ఓ ఏఎస్ఐ ఇంట్లో దొంగలు పడి నగదు, బంగారం భారీగా అపహరించిన సంఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మహేందర్ రెడ్డి కథనం ప్రకారం మీర్పేట మున్సిపాల్ కార్పొరేషన్ పరిధిలోని విజయ పురి కాలనీలో శంకర్ నివాసం ఉంటున్నారు. ఆయన చత్రినాక పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు.
బుధవారం శంకర్ బార్య ముడావత్ లక్ష్మి ఆమనగల్ మండలంలోని కలకొండలో జరిగే శుభకార్యానికి పోయింది. శంకర్ గురువారం ఉదయం 10గంటలకు డ్యూటీకి పోయాడు. ఆయన వెళ్లే సమయంలో కుమారుడు రాజేష్ ఇంట్లోనే ఉన్నాడు. గురువారం మద్యాహ్నం 1,30గంటకు విధులు ముగించుకొని శంకర్ ఇంటికి వచ్చే సరికి ఇంటి తాళం పగల గొట్టి ఉన్నట్లు గమనించి శంకర్ పోలీసులకు సమాచారం అందించారని సీఐ తెలిపారు.
భార్య లక్ష్మి గురువారం సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత 35తులాల బంగారం, రూ.17లక్షలు పోయినట్లు మీర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా నగలు, నగదు కూతురు పెండ్లీ కోసం తీసుకొచ్చిన్నట్లు పోలీసులకు వివరించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీసీపీ సన్ ప్రీత్ సింగ్, ఏసీపీ పురుషోతం రెడ్డి, సిఐ మహేందర్ రెడ్డి, డిఐ భాస్కర్ తదితరులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.