మాదాపూర్, మార్చి 12 : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రతి ఒక్కరూ ఆకర్శితులవుతున్నారని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 200 మంది నాయకులు, కార్యకర్తలు మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి ఎంపీ రంజిత్రెడ్డి, విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలోకి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు చేరడం సంతోషంగా ఉందని అన్నారు. ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ మాట్లాడుతూ నెహ్రూనగర్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఖాళీ అయినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన ముఖ్యనాయకులు హరికృష్ణ, ఉమేశ్ యాదవ్, జీవన్, అశోక్, అశోక్రెడ్డి, సురేశ్, లక్ష్మయ్య, సురేందర్రెడ్డి, రాజు, ఓరుగంటి ఈశ్వర్, శ్రీను, మల్లేశ్ యాదవ్, శంకర్, నాగరాజు, సూర్యకిరణ్ తదితరులు ఉన్నారు.
కేటీఆర్ కాలనీలో…
దుండిగల్, మార్చి12 : నిజాంపేట్ కార్పొరేషన్ పరిధి 11వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామకృష్ణ ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ కాలనీకి చెందిన రాజేశ్ వర్మ ఆధ్వర్యంలో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 30 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి డిఫ్యూటీ మేయర్ ధన్రాజు యాదవ్, కార్పొరేటర్ రవికిరణ్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయప్రసాద్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆవుల జగన్యాదవ్, సాయిముదిరాజు, బొబ్బశ్రీను, మంజునాథ్, శేషగిరి, దశరథ్, నరేంద్ర, నాగరాజు, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.