కంటోన్మెంట్, ఆగస్టు 30: ఆటో కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. ఈ క్రమంలో సోమవారం బోయిన్పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సుమారు వంద మంది ఆటో కార్మికులకు బియ్యం, కూరగాయలు తదితర నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. దీంతో పాటు పలువురు కార్మికులకు ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్రెడ్డి మాట్లా డుతూ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో పేద కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆటో కార్మి కులు, అసంఘటిత కార్మికుల కోసం అనునిత్యం కృషి చేస్తున్నారని తెలిపారు. రోడ్డు ట్యాక్సీ మాఫీ , ఉచిత ప్రమాద బీమా తదితర సౌకర్యాలు కల్పించారన్నారని గుర్తు చేశారు. ఆపద సమయంలో కార్మికులను ఆదుకున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్, ప్రభాకర్, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్, సుబ్రమణ్యస్వామి ఆలయ చైర్మన్ సంతోష్యాదవ్తో పాటు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.