మారేడుపల్లి, ఆగస్టు 19: యువత జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ నాలుగో వార్డులోని రాష్ట్రీయ మాధ్యమిక శిక్షణ అభియాన్, పికెట్లో స్థానిక మాజీ బోర్డు సభ్యురాలు నళిని కిరణ్ ఆధ్వర్యంలో శుభగృహ ప్రైవేటు లిమిటెడ్ వారి సహకారంతో జాబ్ మేళ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మర్రి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ, స్థానిక యువకు ఉపాధి కల్పనతో మంచి అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో శుభగృహ ప్రైవేటు లిమిటెడ్ వారితో జాబ్ మేళా నిర్వహించడం సంతోషకరన్నారు. ఈ మేళా ద్వారా బస్తీలోని యువత అవకశాలను అందిపుంచుకొని భవిష్యత్ నిర్మించుకోవాలన్నారు. జాబ్ అవకాశం వచ్చిన యువతకు శుభాకాంక్షలు చెబుతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మాజీ బోర్డు ఉపాధ్యాక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, శుభగృహ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఎండి కేఎస్ రావు, హెచ్ఆర్ శ్రీనివాస్, స్థానికులు ప్రవీణ్, గంగారాం, ప్రవీణ్ యాదవ్ పాల్గొన్నారు.