హైదరాబాద్ : నగరంలోని లింగంపల్లి రైల్వేస్టేషన్లో భారీగా గంజాయి పట్టుబడింది. రూ. 63 లక్షల విలువ చేసే 336 కిలోల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్ నుంచి ముంబై వెళ్లే ఎల్టీటీ ఎక్స్ప్రెస్లో గంజాయి తరలిస్తున్నట్లు రైల్వే పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో లింగంపల్లి స్టేషన్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి, గంజాయిని సీజ్ చేశారు. ఏసీ కోచ్లో 24 లగేజీ బ్యాగుల్లో గంజాయిని తరలిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. గంజాయిని తరలిస్తున్న ముఠాలో ఏడుగురు మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.