లక్ష్యానికి చేరువలో….
గతేడాది మార్చి 31 నాటికి రూ.158.50కోట్ల ఆస్తి పన్నులు వసూలయ్యాయి. ఈ ఏడాది రూ.200 కోట్ల టార్గెట్ను నిర్ధేశించుకోగా, సర్కిల్లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, షేక్పేట డివిజన్ పరిధిలో మొత్తం 62,835 అసెస్మెంట్లకు గాను, ఇంకా నెల రోజులకు పైగా సమయం ఉండగా, రూ.150.74 కోట్లు పన్నుల రూపంలో వచ్చాయి. అయితే కొందరు మొండి బకాయిదారులు సమయం మించిపోతున్నా ఇంకా చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు.
వచ్చే నెలలో వారెంట్లు జారీ చేస్తాం
సర్కిల్ -18లో లక్ష్యానికి ముందుగానే టార్గెట్ను చేరుకుంటున్నాం. రూ.150.74 కోట్ల పన్నులను వసూలు చేశాం. మొండి బకాయిదారులు ఈ నెలాఖరులోగా బకాయిలు చెల్లించాలి. లేని పక్షంలో వచ్చే నెల నుంచి వారెంట్లు జారీ చేస్తాం. అయినా స్పందించకుంటే గడువు దాటిన వెంటనే వారి ఆస్తులను జప్తు చేస్తాం.
– రజినీకాంత్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్, సర్కిల్ 18
గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిలో ఆస్తి పన్నులు కీలకం. ప్రజలు కట్టిన పన్నుల ద్వారానే అనేక అభివృద్ధి కార్యక్రమాలను బల్దియా చేపడుతున్నది. ప్రతి ఏడాది నిర్ణీత సమయంలో ఆస్తి పన్నులు చెల్లించాల్సి ఉండగా, కొందరు గడువు దాటినా చెల్లించడం లేదు. దీంతో వారికి జీహెచ్ఎంసీ రెడ్ నోటీసులు జారీ చేసింది. సర్కిల్ 18 పరిధిలో సుమారు వెయ్యి మంది బకాయిదారులకు పైగా రెడ్ నోటీసులు జారీ చేశారు. వచ్చే నెల 31 వరకు చివరి తేదీ ఉండగా, మొదటి వారం నుంచే వారెంట్లు జారీ చేసేందుకు అధికారులు సమయాత్తమవుతున్నారు.
– ఖైరతాబాద్, ఫిబ్రవరి 24