సిటీబ్యూరో, జూలై 3(నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీలో పలువురు జోనల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్వింద్ కుమార్ సోమవారం జీవో జారీ చేశారు. శేరి లింగంపల్లి జోనల్ కమిషనర్గా పనిచేస్తున్న జె.శంకరయ్యను జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఎన్నికల విభాగానికి అదనపు కమిషనర్గా బాధ్యతలు అప్పగించారు. అప్పటి వరకు ఎన్నికల విభాగానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న ఎస్.పంకజను పూర్తి స్థాయిలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్గా పరిమితం చేశారు. సికింద్రాబాద్ జోనల్ కమిషనర్గా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డిని శేరి లింగంపల్లి జోన ల్ కమిషనర్గా నియమించారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్గా ఉన్న రవి కిరణ్ను సికింద్రాబాద్ జోనల్ కమిషనర్గా బదిలీ చేశారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్గా ఇన్చార్జిగా కూడా రవికిరణ్ వ్యవహరించనున్నారు.
టి.వెంకన్నను చార్మినార్ జోనల్ కమిషనర్గా బదిలీ చేశారు. ఈ స్థానంలో కొనసాగిన అశోక్ సామాట్న్రు సీడీఎంఏ జేడీగా నియమించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో శానిటేషన్ విభాగం అదనపు కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించిన వి.మమతను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ కూకట్పల్లి జోనల్ కమిషనర్గా పరిమితం చేశారు. శానిటేషన్ విభాగం అదనపు కమిషనర్గా ఆర్.ఉపేందర్రెడ్డిని నియమించారు. శేరి లింగంపల్లి జోన్ నుంచి బదిలీయైన టి.వెంకన్న బాధ్యతలను ఎన్.సుధాంశ్కు అప్పగించారు. కేం ద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ బదిలీలు జరగగా, త్వరలో డిప్యూటీ కమిషనర్ల బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయని జీహెచ్ఎంసీలో చర్చ జరుగుతుంది.