సైదాబాద్, మార్చి 19 : జోన్ పరిధిలో 19 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 11 ప్రభుత్వ, 65 ప్రైవేటు, 6 ప్రభుత్వ గురుకుల రెసిడెన్షియల్, 3 ఎయిడెడ్ పాఠశాలకు చెందిన 3,925 మంది విద్యార్థుల్ల్లో బాలురు 1,918, బాలికలు 2,007 మంది ఉన్నారు. ప్రభుత్వ విద్యార్థులు 436, ఎయిడెడ్ 129, ప్రైవేట్ 3,062, రెసిడెన్షియల్ పాఠశాల 298 మంది పరీక్ష రాస్తున్నారు. గతేడాది 11 ప్రశ్నా పత్రాలుండగా, ఈసారి 6 మాత్రమే ఉండటంతో, అన్ని అంశాలపై పట్టుసాధించే విధంగా ఉపాధ్యాయులు తర్ఫీదు ఇస్తున్నారు. మండల పరిధిలో పరీక్షలు జరిగే కేంద్రాల్లో అన్నిఏర్పాట్లను అధికారులు ఇప్పటి నుంచే పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థులకు సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని, అరగంట ముందు నుంచే కేంద్రాల్లోకి అనుమతి ఇవ్వనున్నారు. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తొలగించటానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచటానికి ఉపాధ్యాయులు, అధికారులు మొదటి ప్రీ-ఫైనల్ పరీక్షలను నిర్వహించారు. రెండో ప్రీ ఫైనల్ పరీక్షలు కొనసాగుతున్నాయి. వచ్చిన మార్కులను వార్షిక పరీక్షల్లో పరిగణలోకి తీసుకోవటంతో పరీక్షలపై విద్యార్థుల్లో మరింత అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేశారు. పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక తరగతులను ఉదయం, సాయంత్రం నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు అల్పాహారం అందించి, తమ పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించటానికి ఉపాధ్యాయులు, అధికారులు కసరత్తు చేస్తున్నారు.
వార్షిక పరీక్షలు మరో పక్షం రోజులు మాత్రమే ఉండటంతో ఈ నెల 24 నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పాఠశాల్లో విద్యార్థులందరూ సకాలంలో హాల్టికెట్లు తీసుకోవాలని, హాల్ టికెట్లు అందని వారు ప్రధానోపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లాలని విద్యాధికారులు సూచిస్తున్నారు.
వార్షిక పరీక్షల దృష్ట్యా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాం. నిర్వహణలో పాల్గొనే అధికారులకు శిక్షణ తరగతులు జరుగనున్నాయి. విద్యుత్ అంతరాయం, తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా ఆయా శాఖ అధికారులను సమన్వయం పరుస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఏడాది పదో తరగతి ఉతీర్ణతా శాతం పెంచటానికి కృషి చేస్తున్నాం. విద్యార్థుల్లో మనోైస్థెర్యం కల్పించి పరీక్షలకు సిద్ధం చేస్తున్నాం.
– టి. రాధాకృష్ణ , మండల ఉప విద్యాశాఖ అధికారి