ఖైరతాబాద్, డిసెంబర్ 25 : దేశీయంగా తయారు చేసిన పిల్లలు ఆడుకునే బొమ్మల ప్రదర్శనను ‘నమస్తే వరల్డ్’ పేరుతో ప్రసాద్ ఐమాక్స్ థియేటర్లో ఏర్పాటు చేశారు. దీనిని సినీ నటుడు మంచు మనోజ్, మౌనిక దంపతలు సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీతో కలిసి ముంబయిలోని జీయో వరల్డ్లో స్థాపించామని, హైదరాబాద్ నగరవాసులకు పరిచయం చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. పిల్లలు ఆడుకునే వివిధ రకాల బొమ్మలతో పాటు కార్టూన్ సిరీస్కు సంబంధించిన టాయ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు.