వాహనం ఢీకొని.. మృతి
మాదాపూర్, జూలై 6: వర్షం పడుతుందని రోడ్డు పక్కన ఆగిన ఓ యువకుడిని వాహనం ఢీకొట్టడంతో చనిపోయాడు. మాదాపూర్ ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం .. తమిళనాడుకు చెందిన జే. తరునాస్ వినోద్ (25) ఓ కంపెనీలో జూనియర్ సేల్స్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు.
మంగళవారం రాత్రి విధులు ముగించుకొని..బయలుదేరగా, వర్షం రావడంతో మార్గమధ్యలో ఐకియా సమీపంలోని అండర్పాస్ వద్ద రోడ్డు పక్కన తన బైక్ను ఆపాడు. అదే సమయంలో ఓ వాహనం వెనుకాల నుంచి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడి వినోద్ మృత్యువాతపడ్డాడు.