ఖైరతాబాద్, మే 26: మహిళను వెంటపడి వేధించిన వ్యక్తికి ఐదు రోజుల జైలు శిక్ష పడింది. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్లోని ఓ ఆస్పత్రిలో పనిచేసే మహిళ విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా గత నెల 21న బైకుపై ఆమెను వెంబడించిన ఓ వ్యక్తి అసభ్యకరంగా కామెంట్స్ చేశాడు.
బాధితురాలు షీటీమ్స్లో ఫిర్యాదు చేసింది. నిందితుడు నగేశ్ (36)ను అరెసు ్టచేసి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం గురువారం ఐదు రోజుల జైలు శిక్ష విధించింది.