చార్మినార్, మెహిదీపట్నం 22 : నగరంలోని పలు పోలీస్స్టేషన్ల పరిధిలో ద్విచక్ర వాహనాలను తస్కరించి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ సునీతరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫ్నగర్ ప్రాంతానికి చెందిన నిందితుడు (16) పాఠశాల దశలోనే చదువు మానేసి కార్పెంటర్గా పని చేస్తుండేవాడు. ద్విచక్ర వాహనాలపై తిరుగాలనే బలమైన కోరిక ఉండేది. తన రోజువారి సంపాదనతో ద్విచక్ర వాహనం కొనుగోలు చేయలేనని భావించిన నిందితుడు చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో నగరంలోని హుమాయూన్నగర్, ఆసిఫ్నగర్, గోల్కొండ, బంజారాహిల్స్, లంగర్హౌస్ పోలీస్స్టేషన్ల పరిధిలో ఎనిమిది ద్విచక్ర వాహనాలను చోరీ చేశాడు. వాటిని స్థానికంగా ఉండే సయ్యద్ నాబి, అబ్దుల్అల్తాఫ్, మహ్మద్ ఫెరోజ్లకు ఒక్కో వాహనాన్ని రూ.10వేలకు చొప్పున విక్రయించాడు. సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని ఎనిమిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం గోల్కొండ పోలీసులకు అప్పగించారు. కేసును ఛేదించిన వారిలో ఇన్స్పెక్టర్ రాఘవేంద్రతోపాటు ఎస్సై లు శ్రీశైలం, నరేందర్, నర్సింహులు, షేక్బురాన్, ఇతర సిబ్బంది ఉన్నారు.