కందుకూరు : గుర్తు తెలియని వాహనం ఢీ కొన్న సంఘటనలో వ్యక్తి మృతి చెందాడు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మండల పరిధిలోని అగర్మియగూడ గ్రామానికి చెందిన కొత్త భిక్షపతి (45 ) శనివారం పెద్దమ్మ గుడి వద్ద జరిగిన వివాహనికి హజరయ్యాడు.
ఆ తరువాత పక్కనే ఉన్న లేమూరు గ్రామానికి వెళ్లి అక్కడే రాత్రి పొద్దుపోయే వరకు ఉన్నాడు. రాత్రి నడుచుకుంటు గ్రామానికి వస్తుండగా గేటు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో రోడ్డు పక్కన పడి మృతి చెందాడు. సోమవారం ఉదయం 1గంట ప్రాంతంలో లేమూరు గ్రామానికి చెందిన వ్యక్తి చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
భిక్షపతి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతూ సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై స్వామి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి సీఐ క్రిష్ణంరాజు ఆధ్వర్యంలో కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై స్వామి తెలిపారు.