వెంగళరావునగర్ : రోడ్డు ప్రమాదంలో గాయపడి..చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందిన సంఘటన ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై స్వప్నా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..బీకే గూడ సమీపంలోని స్వామి థియేటర్ వద్ద నివసించే మండల్ రమేష్ (58) ప్రైవేటు ఉద్యోగి.
ఈ నెల 5 న సాయంత్రం తన ద్విచక్ర వాహనం పై ఎర్రగడ్డ నుండి పంజాగుట్ట వైపు వెళ్తుండగా అమీర్పేట మెట్రో స్టేషన్ వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన నానో కారు రమేష్ నడుపుతున్న బైక్ను ఢీ కొట్టింది. కిందపడి తీవ్ర గాయాలపాలైన బాధితుడిని పోలీసులు నిమ్స్ దవాఖానాకు తరలించారు.
చికిత్స పొందుతూ రమేష్ మంగళవారం ఉదయం మృతి చెందాడు. రమేష్ కుమారుడు రోహిత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.