గర్భందాల్చిన యువతి, పెండ్లికి నిరాకరించిన యువకుడు
పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు
బొల్లారం, జూన్ 8 : పెండ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి పెండ్లికి నిరాకరించిన యువకుడిపై తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీఐ శ్రావణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి గ్రామానికి చెందిన యువతి (24) లెక్చరర్గా పనిచేస్తున్నది. అత్తాపూర్లో నివాసముండే తన దూరపు బంధువైన టి.నిహాల్ సింగ్(24)తో 2017లో పరిచయం ఏర్పడింది.
ఈ క్రమంలో యువతిని పెండ్లి చేసుకుంటానని నమ్మించిన నిహాల్ సింగ్ పలుమార్లు లైంగికదాడికి పాల్పడటంతో గర్భం దాల్చింది. దీంతో పెండ్లి చేసుకోవాలని ప్రియుడిని కోరగా నిరాకరించడంతో యువతి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.