శేరిలింగంపల్లి: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రాయదుర్గం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం సుమారు 4:15 గంటల సమయంలో ఖాజాగూడలోని అంకుర హాస్పిటల్ ఎదురుగా ఓఆర్ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ గ్రామం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
ఓ వ్యక్తి రహదారి దాటుతుండగా, ఖాజాగూడ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆ కారు డ్రైవర్ జైద్ షాఖాద్రి , మరో వ్యక్తి కలిసి హాస్పిటల్కు తరలించే ప్రయత్నం చేస్తుండగా, అతి వేగంతో వచ్చిన రెండు కార్లు వారిని ఢీకొట్టాయి. ఆ రెండు కార్ల డ్రైవర్లు పరారయ్యారు. పాదచారి గాయపడి ఘటనా స్థలంలోనే మృతి చెందగా, కారు డ్రైవర్ జైద్ షాఖాద్రి తీవ్రంగా గాయపడ్డాడు.