హైదరాబాద్ : మాయమాటలు చెప్పి మైనర్ బాలికను అపహరించి లైంగిక దాడికి(Girl assault )పాల్పడ్డ నిందితుడు ఐరగడిండ్ల శివాజి(20)కి యావజ్జీవ కారాగార శిక్ష( Life sentence), రూ. 25వేల జరిమానా విధిస్తూ బాధిత బాలికకు 5 లక్షల రూపాయల పరిహారం అందించాలని ఆదేశిస్తూ రంగారెడ్డి(Rangareddy) జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. ప్రత్యేక పీపీ సునీత బర్ల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కన్నాయిపల్లి గ్రామానికి చెందిన నిందితుడు కందుకూరు మండలం మీర్ఖాన్పేట్ గ్రామ పరిధిలో నిర్మిస్తున్న పవర్ గ్రిడ్ సబ్ స్టేషన్లో కూలి పని చేస్తుండేవాడు. కల్వకుర్తి మండలానికి చెందిన బాలిక కుటుంబం సైతం అక్కడే గుడిసెలు వేసుకుని పవర్ గ్రిడ్లో పని చేస్తుండేవారు.
ఈ క్రమంలో మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్న శివాజీ 2017 ఫిబ్రవరి12 రాత్రి బాలికను పెళ్లి పేరుతో మభ్యపెట్టి, మాయమాటలు చెప్పి సికింద్రబాద్కు తీసుకువెళ్ళి లైంగిక పాల్పడి రెండు రోజుల తరువాత బాలికను ఇంటికి వద్ద దింపేసి వెళ్లిపోయాడు. దీంతో బాలిక తండ్రి కందుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పోక్సో,ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సాక్షాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితునికి పైవిధంగా శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.