మారేడ్పల్లి, డిసెంబర్ 19 : సెల్ ఫోన్ మాట్లాడుతూ రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
గుండ్లపోచంపల్లికి చెందిన బీసుమండల్ (26) ఆదివారం తన స్నేహితుల వద్దకు వెళ్లి రాత్రి సమయంలో ఇంటికి వస్తూ.. బొల్లారం-గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్ల మధ్యన సెల్ ఫోన్ మాట్లాడుతూ పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.