అల్వాల్, మే 26: ఉరి వేసుకొని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్ కొత్త చెరువు సమీపంలోని క్వార్టర్స్లో నివాసముండే ప్రశాంత్(24) కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
తండ్రి వేధింపులు భరించలేక అతడి తల్లి రెండేండ్ల కిందట ఆత్మహత్య చేసుకున్నది. ప్రస్తుతం తండ్రి జైళ్లో ఉన్నాడు. అప్పటి నుంచి ప్రశాంత్ తన తమ్ముడు సాయితో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి సాయి డ్యూటీకి వెళ్లాడు. ఉదయం వచ్చే సరికి ప్రశాంత్ ఇంట్లో చీరతో ఉరివేసుకుని మృతిచెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.