మేడ్చల్, ఫిబ్రవరి15 (నమస్తే తెలంగాణ) :మల్లారెడ్డి యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ బీఎస్సీ అగ్రికల్చర్ నుంచి 43 మంది విద్యార్థులు అమెరికా, నెథర్లాండ్ అగ్రికల్చర్ లర్నింగ్ ప్రోగాంకు ఎంపికయ్యారు. మొదటగా ఈ నెల 19న ఇద్దరు విద్యార్థులు అమెరికాకు వెళ్లగా, ఈ నెల చివరి వారంలో 30మంది విద్యార్థులు అమెరికా, 13 మంది విద్యార్థులు నెదర్లాండ్కు వెళ్లనున్నారు. భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా మల్లారెడ్డి యూనివర్సిటీ నుంచి వ్యవసాయ విద్యార్థులను అమెరికా, నెదర్లాండ్ పంపినట్లు అగ్రికల్చర్ డీన్ డాక్టర్ రాజారెడ్డి తెలిపారు.
అమెరికా, నెదర్లాండ్ వెళ్లే గొప్ప అవకాశం వచ్చింది. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. తమ యూనివర్సిటీ నుంచి 43 విద్యార్థులు విదేశాలకు వెళ్లడం సంతోషంగా ఉన్నది. వచ్చే సంవత్సరం మూడవ సంవత్సరం విద్యార్థులు ఎంపికయ్యేలా కృషి చేయాలి.
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి