మేడ్చల్ రూరల్, మార్చి 19: రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో అన్ని కులాలు, వర్గాలకు సమన్యాయం చేస్తున్నదని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని పూడూర్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన మల్లన్న కల్యాణోత్సవానికి మంత్రి సతీ సమేతంగా విచ్చేసి స్వామి పట్టువస్ర్తాలు సమర్పించారు. అనంతరం గ్రామంలో యాదవ సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం అవతరించిన అనంతరం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలతో కులవృత్తులు బలోపేతం అయ్యాయని అన్నారు. కుల సంఘాలకు ప్రత్యేక భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులు రాష్ట్రంలో జరుగుతున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ గొల్ల కురుమ, యాదవులకు గొర్రెల పథకాన్ని అందించి ఆదుకున్నారని, అదే విదంగా రైతులకు ఉచిత కరెంట్, పంట సాగు కోసం రైతుబంధు, రైతు బీమా పథకాలను అమలు మహానేత అన్ని కొనియాడారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని ఈ సందర్భంగా స్వామి వారిని మంత్రి వేడుకున్నారు. జాతర సందర్భంగా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున స్వామి వారిని దర్శించుకుని పూజలు చేసి, సాయంత్రం బోనాల ఊరేగింపు చేపట్టి నైవేద్యం సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్చార్జి రాజశేఖర్రెడ్డి, గ్రామ సర్పంచ్ బాబు యాదవ్, వైస్ ఎంపీపీ వెంకటేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, వార్డు సభ్యులు, యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
మేడ్చల్, మార్చి 19: మండల పరిధిలోని నూతన్కల్ గ్రామానికి సీడీపీ నిధులు మంజూరయ్యాయి. గ్రామంలో మురికి కాల్వల నిర్మాణానికి రూ.10 లక్షలు నిధులు మంజూరైనాయి. ఇందుకు సంబంధించిన పత్రాన్ని సర్పంచ్ కవితాజీవన్కు మంత్రి చామకూర మల్లారెడ్డి ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎంపీపీ రజితారాజమల్లారెడ్డి, సర్పంచ్ గీతాభాగ్యారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సురేశ్ రెడ్డి, జిల్లా కో ఆప్షన్ సభ్యుడు గౌస్పాష, మండల కోఆప్షన్ సభ్యురాలు యూనిస్పాషా, మండల మహిళా విభాగం అధ్యక్షురాలు రమాదేవి, నాయకులు అశోక్ విప్లవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.