ఘట్కేసర్,జూలై8: పోచారం మున్సిపాలిటీ సద్భావన కాలనీలోని సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హామీ ఇచ్చారు. శనివారం సద్భా వన కాలనీలో చైర్మన్ బి.కొండల్రెడ్డి,కౌన్సిలర్ శ్రీలత బుచ్చిరెడ్డి, సంబంధిత అధికారులతో కలిసి మంత్రి పర్యటించి కాలనీవాసుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కాలనీలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కాలనీ వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం, పార్కు, ఓపెన్జిమ్, కమ్యూనిటీహాల్, ప్లే గౌండ్, వంటి వసతులను ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. హౌసింగ్ బోర్డు ద్వారా కాలనీలో అన్ని సదుపాయాలను కల్పించాలని అధికారులకు సూచించారు.
కాలనీలో పైప్లైన్ లీకేజీ, పచ్చదనం, నీటి, విద్యు త్ సరఫరా వంటి సౌకర్యాలు లేవని స్థానికులు మంత్రికి ఫిర్యాదు చేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను మంత్రి మల్లారెడ్డి ఆదేశించారు.కాలనీలో చేపట్టాల్సిన పనులను తక్షణమే నిర్వహించాలని చైర్మన్ కొండల్రెడ్డి,కౌన్సిలర్ శ్రీలతా బుచ్చిరెడ్డిని మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో హౌసింగ్ అధికారులు,జిల్లా గ్రథాలయ శాఖ చైర్మన్ దర్గాదయాకర్ రెడ్డి,కౌన్సిలర్లు బి.హరిప్రసాద్రావు, సింగిరెడ్డి సాయిరెడ్డి,బాలగోని వెంకటేశ్ గౌడ్, మెట్టు బాల్రెడ్డి,పోచారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ అధ్యక్షుడు మందాడి సురేందర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి ఎన్.శేఖర్ ముదిరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బాలేశ్,నాయకులు జగన్మోహన్ రెడ్డి,ఎన్. కాశయ్య, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి,మున్సిపాలిటీ కోఆష్షన్ సభ్యులు అక్రం అలీ, శంకర్,రైతు సొసైటీ డైరెక్టర్ ధర్మారెడ్డి, కార్యకర్తలు, నాయకులు,స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.