పీర్జాదిగూడ, నవంబర్9: మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి చామకూర మల్లారెడ్డి గెలుపును కోరుతూ పీర్జాదిగూడ కార్పొరేషన్లో మేయర్ జక్క వెంకట్రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్గాడ్, కార్పొరేటర్లు గురువారం ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటింటికీ వెళ్లి పథకాలు, అభివృద్ధిని వివరించారు. మరింత అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో మల్లారెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్, హరిశంకర్రెడ్డి, అనంతరెడ్డి, నవీన్రెడ్డి, యుగేందర్రెడ్డి, మంజు ల రవీందర్, శశిరేఖ బుచ్చియాదవ్, నాయకులు, వార్డు కమిటీ సభ్యులు, కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
మంత్రి మల్లారెడ్డి గెలుపు కోసం పూజలు
ఘట్కేసర్: మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి మల్లారెడ్డి అత్యధిక మెజార్టీతో విజయం సాధించాలని కోరుతూ పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలోని గాయత్రీఆలయంలో బీఆర్ఎస్ శ్రేణులు గురువారం చండీయాగం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు చామకూర భద్రారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పోచారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ అధ్యక్షుడు మందాడి సురేందర్రెడ్డి,చైర్మన్ బి.కొండల్రెడ్డి,కౌన్సిలర్లు,నాయకులు,కార్యకర్తలు,మహిళలు పాల్గొన్నారు.అదేవిధంగా కారు గుర్తుకు ఓటు వేసి మంత్రి మల్లారెడ్డిని గెలిపించా లని కోరుతూ ఘట్కేసర్ చైర్పర్సన్ ముల్లి పావనీ జంగ య్య యాదవ్ మున్సిపాలిటీలోని ఇంటింటికీ వెళ్లి బొట్టుపెట్టి ఓటు అభ్యర్థించారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండాపూర్లో మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఉపాధ్యాక్షుడు వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు.
శామీర్పేటలో..
శామీర్పేట: మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి చామకూర మల్లారెడ్డికి మద్దతుగా శామీర్పేటలో బీఆర్ఎస్ నేతలు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.
మల్లారెడ్డి గెలుపు ఖాయం
కీసర: మంత్రి చామకూర మల్లారెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేశ్, ఎంపీటీసీ తటాకం నారాయణశర్మలు అన్నారు మండలంలోని పలు గ్రామాల్లో మంత్రికి మద్దతుగా వారు ఇంటింటికీ తిరిగి సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటెయ్యాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు బి. శంకర్గౌడ్, సుమన్బన్నీ, మెట్టు సతీష్, చినింగని బాల్రాజ్, పడమటి నర్సింహరెడ్డి,నత్తి భూపాల్తో పాటు పలువురు పాల్గొన్నారు.