Ragidi Laxma Reddy | కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 7 : ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు లేక ఏడారిగా మారిన తెలంగాణ ప్రాంతం అపర భగీరథుడు కేసీఆర్ నేతృత్వంలో స్వరాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లోనే తిరిగి తెలంగాణ ప్రాంతాన్ని తమ నీచ రాజకీయాలతో ఏడారిగా మారుస్తున్నదని మండిపడ్డారు. ఇప్పుడు వలసలు పట్టే పరిస్థితి నెలకొందన్నారు.
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఆదివారం కుత్బుల్లాపూర్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. చింతల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్తో కలిసి 131 కుత్బుల్లాపూర్ డివిజన్ ముఖ్యకార్యకర్తలు, పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీశ్, నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు దూదిమెట్ల సోమేశ్యాదవ్, డివిజన్ అధ్యక్షుడు దేవరకొండ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు కిశోర్చారి, యాదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.