మల్కాజిగిరి, మే 11: మల్కాజిగిరి నియోజకవర్గంలో వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారానికి చేపట్టిన బాక్స్ డ్రైన్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తి అయితే ఇక వరద ముంపు సమస్య తలెత్తదు. స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రత్యేక కృషితో నిధులు మంజూరు కాగా పనులు జరుగుతున్నా రు. ఇందులో భాగంగా ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్లో వరదనీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రూ.18.6 కోట్లతో 1.60కిలో మీటర్ల మేర బాక్స్ డ్రైన్ల నిర్మాణ పను లు చేపట్టారు. ఒక మీటర్ లోతు, రెండు మీటర్ల వెడల్పు తో నిర్మిస్తున్నారు. మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని వినాయక్నగర్, మౌలాలి, ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్ల పరిధిలో బండ చెరువు విస్తరించి ఉంది. ఈ చెరువు నుంచి ప్రవహించే వరదనీరు ఈస్ట్ ఆనంద్బాగ్ మీదుగా ప్రవహి స్తుంది. ఈ వరద నీటితో చుట్టుపక్కల ప్రాంతాలు వరదముంపునకు గురయ్యేవి. ఈ సమస్యను ఎమ్మెల్యే మైనంపల్లి.. మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లగా.. మంత్రి స్వయంగా ఆ ప్రాంతంలో పర్యటించి సమస్యను పరిశీలించారు. వెంటనే బాక్స్ డ్రైన్ నిర్మాణానికి రూ.18.6కోట్లు మంజూరు చేశారు.
వేగంగా నిర్మాణ పనులు
బండ చెరువు నుంచి వచ్చే వరద నీరు సాఫీగా వెళ్లడానికి ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్ పరిధిలోని అనంత సరస్వతినగర్, ఎన్ఎండీసీ కాలనీ, షిరిడీ నగర్, సీఫెల్ కాలనీ మీదుగా ఉప్పరిగూడ, రాజానగర్ వరకు ప్రస్తుతం బాక్స్డ్రైన్ పనులు జరుగుతున్నాయి. అ లాగే.. ఆనంద్బాగ్ ఆర్యూబీ నుంచి వరద నీ రు మళ్లించేందుకు మరో బాక్స్డ్రైన్ను కల్యాణ్నగర్ వరకు చేపట్టనున్నారు.
యుద్ధప్రాతిపదికన బాక్స్డ్రైన్ పనులు..
నియోజకవర్గ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పి స్తాం. గత దశాబ్దాలుగా సమస్యగా ఉన్న డ్రైనేజీకి శాశ్వత పరిష్కారం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ బాక్స్ డ్రైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం దీని నిర్మాణం కోసం రూ.18.6కోట్లు మంజూరు చేయడం హర్షణీయం. బండ చెరువు కింద ఉన్న నాలాల స్థానం లో పూర్తిస్థాయిలో బాక్స్డ్రైన్ పనులు చేపట్టాం. ఈ పను లు పూర్తి అయితే వచ్చే వర్షాకాలంలో ఇక వరద ముంపు సమస్య ఉండదు. ఈ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. అధికారులు నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు.
– మైనంపల్లి హన్మంతరావు, మల్కాజిగిరి ఎమ్మెల్యే