మేయర్ గద్వాల్ విజయలక్ష్మి , అంబర్పేట సర్కిల్-16 డీసీ వేణు గోపాల్
బంజారాహిల్స్/హిమాయత్నగర్/మారేడ్పల్లి/అడ్డగుట్ట,ఏప్రిల్ 25: ప్రపంచ మలేరియా దినం సందర్భంగా బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని ఎన్బీటీనగర్ ప్రభుత్వ పాఠశాలలో జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సోమవారం ప్రారంభించారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
గాంధీ కుటీర్ బస్తీలో..
పరిసరాల పరిశుభ్రతతో దోమలను నిర్మూలించి మలేరియా వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రతి పౌరుడు కృషి చేయాలని అంబర్పేట సర్కిల్-16 డీసీ వేణు గోపాల్, హిమాయత్నగర్ కార్పొరేటర్ జి.మహాలక్ష్మి అన్నారు. ప్రపంచ మలేరియా డేను పురస్కరించుకొని గాంధీ కుటీర్ బస్తీలో ర్యాలీ నిర్వహించి దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
ఇండ్ల పరిసరాల్లో పిచ్చి మొక్కలు,ప్లాస్టిక్ కప్పులు, గ్లాస్లు కవర్లు లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం కార్యక్రమంలో గాంధీ కుటీర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు ఎన్.రాజేంద్ర ప్రసాద్, ప్రధాన కార్యదర్శులు కేశబోయిన శ్రీధర్, పి.ప్రభాకర్గౌడ్,బీజేపీ నాయకులు జి.రామన్గౌడ్, పి.ప్రసాద్,నర్సింగ్గౌడ్, జైస్వాల్, కవిత, మల్లేశ్, ఎంటమాలజిస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ వి.నరేందర్రెడ్డి, డాక్టర్ రాంబాబు పాల్గొన్నారు.
దోమలు వృద్ధ్ది చెందకుండా చూడాలి
– కార్పొరేటర్ కొంతం దీపిక
దోమలు వృద్ధి చెందకుండా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక అన్నారు. మోండా డివిజన్లోని శివాజీనగర్, మార్కెట్ స్ట్రీట్, డొక్కాలమ్మ ఆలయం తదితర ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ఎంటమాలజీ , స్థానిక కార్పొరేటర్ సంయుక్తంగా కలిసి ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంటమాలజీ అధికారి సూపర్వైజర్ రవీందర్రెడ్డి, జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.
మలేరియా రహిత సమాజానికి కృషి చేయాలి
– కార్పొరేటర్ లింగాని ప్రసన్న
మలేరియా రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో తుకారాంగేట్ సీఐ ఎల్లప్ప, నగర గ్రంథాలయ డైరెక్టర్ లింగాని శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.