మలబార్ సంస్థ మహేశ్వరం మండల కేంద్రంలో రూ.750 కోట్ల పెట్టుబడితో 2.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో యూనిట్ను ఏర్పాటు చేస్తున్నది. దీని ద్వారా 2,750 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వచ్చే ఏడాది నవంబర్ 30 నాటికి మలబార్ సంస్థ స్థాపించి 30 ఏండ్లు అవుతున్న నేపథ్యంలో.. మహేశ్వరంలో నిర్మిస్తున్న యూనిట్ సైతం అందుబాటులోకి వచ్చేలా సంస్థ యాజమాన్యం అడుగులు వేస్తున్నది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా మలబార్ సంస్థకు సంబంధించి 17 రిటైల్ షోరూములు ఉన్నాయి. ఆయా షోరూముల్లో వేయి మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. ఇందులో భాగంగానే రిటైల్ షాపులను మరింతగా విస్తరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నది. రానున్న 2023వ ఆర్థిక సంవత్సరంలో 97 షోరూములను కొత్తగా ప్రారంభించాలని మలబార్ సంస్థ సంకల్పించింది. ఇందులోభాగంగానే దేశంలో 60, విదేశాల్లో 37 షోరూములను ఏర్పాటు చేయనున్నారు. కాగా, మలబార్ సంస్థకు ‘ఖతార్, దుబాయి, షార్జా, బహ్రెయిన్తో పాటు దేశంలోని ముంబై, కోల్కత్తా, బెంగళూరు, కోయంబత్తూర్, కోజీకోడ్, త్రిశుర్లలో తయారీ యూనిట్లు ఉన్నాయి.
పూర్తి స్థాయి స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం
మహేశ్వరంలో 3.7 ఎకరాల్లో , 2.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పూర్తి స్థాయి స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం, డిజైనింగ్ స్టూడియో, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. యూనిట్కు ఆటోమేటెడ్ గిడ్డంగి సౌకర్యం కూడా ఉంది. యూనిట్ విస్తీర్ణంలో 33 శాతం గ్రీనరీని ఏర్పాటు చేస్తున్నారు. ఏడాదికి 10 టన్నుల బంగారు ఆభరణాలు, 1.5 లక్షల క్యారెట్ల వజ్రాభరణాలను ఉత్పత్తి చేసే లక్ష్యంతో ఉన్నారు.
పలు పరిశ్రమలు.. ఉపాధి మార్గాలు
జిల్లాలో ఇప్పటికే ప్రముఖ రైల్వే కోచ్ తయారీ కంపెనీ అయిన మేధా సెర్వో డ్రైవ్స్ రూ.625 కోట్లతో నెలకొల్పారు. ఇందులో 150 మంది ఉపాధి పొందుతున్నారు. అలాగే, ప్రముఖ టైర్ల కంపెనీ అయిన స్పిన్ మ్యాక్స్ రూ.250 కోట్లతో తన ఉత్పత్తిని ప్రారంభించింది. ప్రత్యక్షంగా 200 మందికి పైగా ఉపాధి లభిస్తున్నది. ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ కేటెక్స్ గ్రూప్ సీతారాంపూర్లో రూ.1400 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ ద్వారా 10 వేల మందికి ఉపాధి లభ్యం కానున్నది. ఇంకా, ప్రముఖ సంస్థ అయిన ఇస్టర్ ఫిల్మ్టెక్ రూ.1400 కోట్ల పెట్టుబడితో చందనవల్లి గ్రామంలో నిర్మాణం చేపడుతున్నది. ఈ సంస్థలోనూ 1500 మందికి ఉపాధి దొరకనున్నది.
రంగారెడ్డి జిల్లా ఆభరణాల తయారీ క్షేత్రంగా మారబోతోంది. బంగారం, వజ్రాల తయారీ రంగంలో ప్రముఖ సంస్థ అయిన మలబార్ తమ అతి పెద్ద రిఫైనరీ, మానుఫ్యాక్చరింగ్ యూనిట్కు జిల్లాలో నెలకొల్పుతున్నది. ఇందుకు సంబంధించి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మానుఫ్యాక్చరింగ్, రిఫైనరీ యూనిట్కు ఆ సంస్థ చైర్మన్ అహ్మద్తో కలిసి మంత్రి కేటీఆర్ ఇటీవల శంకుస్థాపన చేశారు.
-రంగారెడ్డి, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ)
ఎన్నో కంపెనీలు వస్తున్నాయి…
సమర్థ్ధవంతమైన రాష్ట్ర ప్రభుత్వ పాలసీల కారణంగా ప్రపంచ ఖ్యాతి గాంచిన ఎన్నో కంపెనీలు జిల్లాలోకి పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ‘వెల్స్పన్, విప్రో, గూగుల్, అమెజాన్, పీ అండ్ జీ (ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్), ప్రోకర్ణ గ్రానైట్స్, మైక్రోమ్యాక్స్, కటెర్రా, చిరిపాల్’ వంటి కంపెనీలు వచ్చాయి. వాటి కారణంగా స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభించాయి.
– జే.రాజేశ్వర్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్, జనరల్ మేనేజర్ అండ్ చైర్మన్, లఎంఎస్ఈఎఫ్సీ,జిల్లా పరిశ్రమల కేంద్రం, రంగారెడ్డి జిల్లా